సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ సంగతి పక్కన పెడితే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు ఎక్కడ హాని జరిగినా వెంటనే తన దైన శైలిలో స్పందిస్తుంటుంది. అందులో భాగంగానే ఇటీవల ఎడ్ల బండిపై ఆటోను పెట్టి ర్యాలీ చేసిన ఓ నేతపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిందీ జబర్దస్త్ యాంకర్.