Rinku Singh : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, తన జట్టు తర్వాతి మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండటంతో రింకూ సింగ్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 21న తన కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి వారణాసి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.