పవిత్ర తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొండోడికోనలో చెలరేగిన మంటలు సుమారు 2 కిలోమీటర్ల మేర అరుదైన వృక్ష సంపదను, వనమూలికలను ధ్వంసం చేశాయి. అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.