తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.