రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయగా.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు..