మండే ఎండల్లో ఇంటిని చల్లగా ఉంచేందుకు జైపూర్ కుటుంబాలు అద్భుత పరిష్కారం కనుగొన్నాయి. ఏసీలు, కూలర్లు లేకుండానే ఇంటి పైకప్పుపై కూరగాయల మొక్కలు పెంచి రూఫ్‌టాప్ గార్డెనింగ్ ద్వారా లోపలి వేడిని 50% తగ్గించారు. తక్కువ ఖర్చుతో, కరెంట్ బిల్లులు లేకుండా, పర్యావరణ అనుకూల పద్ధతిలో ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చని నిరూపించారు.