
పశ్చిమ బెంగాల్: బిహార్, ఒడిశాలో కమలం వికసించిందని.. ఇప్పుడు బెంగాల్ వంతు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జనసంఘ్ కు బెంగాల్ పుట్టినిల్లు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ పశ్చిమబెంగాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఏం చేయలేదని, టిఎంసి రైతులు, యువత కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టిఎంసి విధానం అని మండిపడ్డారు. 15 ఏళ్లు ఏం చేశారో టిఎంసి ఒక్కసారైనా చెప్పిందా? అని రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత లేదా? అని మోడీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చారని, టిఎంసి తన సిండికేట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని, టిఎంసి సిండికేట్ ను ఓడించాలని సూచించారు. బెంగాల్ యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు.











