న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శ్రీకాకుళం జిల్లా చినపల్లివూరు గ్రామానికి చెందిన గర్తం ఇందు (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2017లో గర్తం శంకరరావుతో ఇందు వివాహం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన భర్తతో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఇందు మృతిపై అనుమానాలున్నాయని తల్లి మోహిని, సోదరుడు సందీప్ ఆరోపించారు. భర్త, అత్త వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి appeared first on Navatelangana.