హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్కైరూట్ కంపెనీ తాము తెస్తే.. ఈ సిఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. బిఆర్ఎస్ బలం పెరిగిందని కెటిఆర్ అన్నారు. ‘‘మోసపు హామీలు నమ్మి.. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కాంగ్రెస్‌లో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి? మూసీని దుర్గంధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రూ.3.70 లక్షల కోట్లు అప్పు చేశానని రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఢిల్లీకి మూటలు మోయటం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు’’ అని కెటిఆర్ ఆరోపించారు.