మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, కోదండరామ్ రెడ్డిని నియమిస్తూ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ లెజిస్లేచర్ కౌన్సిల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి ఈ నియామకాలను ఆమోదించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. మే 27, 2023 వ తేదిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు డి రాజేశ్వర్‌రావు, ఫారుఖ్ హుస్సెన్ ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో వీరిద్దరి నియమించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.