నవతెలంగాణ హైదరాబాద్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అంబులెన్స్‌ కోల్‌కతా నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Assembly Elections

The post ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి appeared first on Navatelangana.