ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వజ్రేష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపి ఈటేల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ముప్పు రామారావు, జేఏసి ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మచారి, ఎనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.