ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.పాతుమ్ నిస్సాంక 50 పరుగులతో రాణించాడు. అశుతోష్ శర్మ (39: 28 బంతుల్లో 3 సిక్స్, 3 ఫోర్లు)  జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేశారు.