హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకూ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న జాబితాలో అతడు చోటు దక్కిచుకున్నాడు. ఇప్పటివరకూ అన్ని ఎడిషన్లలోనూ కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్లు ఇద్దరే. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ జాబితాలోకి మనీశ్ పాండే కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీశ్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.