నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన ఏనుగు వీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ మంగళవారం మృతురాలి కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. సన్నబియ్యం బస్తా, క్యాన్ నూనె, నిత్యావసర వస్తువులు అందజేసీ ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, కోశాధికారి బాపు, కార్యదర్శి రమేష్ రావు, శేషిదర్ రావు పాల్గొన్నారు.

The post మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం appeared first on Navatelangana.