
అమరావతి: ఇద్దరు బాలుర్లు ఫోన్లలో ఆడుకుంటుండగా ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఓ బాలుడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని పూడ్చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విందూరు ప్రాంతంలోని మర్రిపల్లిమడుగు గ్రామ శివారులోని ఓ తోటలో రెండు కుటుంబాలు పని చేస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన 17 ఏళ్ల బాలుడు, ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. ఇద్దరు ఫోన్లో ఆడుకుంటుండగా గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో 17 ఏళ్ల బాలుడు మరో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. భయంతో అక్కడే గుంటలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. తన కుమారుడు కనిపించడంతో గూడూరు పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్కు తరలించారు.














