నవతెలంగాణ – హైదరాబాద్ : వేసవి సెలవులు, విదేశీ విద్య కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం, ఎంజీబీఎస్, బేగంపేట కేంద్రాల్లో 3,100 స్లాట్లు, నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాల్లో 900 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 4,000 మందికి ఈ మేళా ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించనున్నారు.

The post సికింద్రాబాద్ లో మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా appeared first on Navatelangana.