ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం
By TodayTelugu Desk1 min read0 views

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం నియంత్రణ కోల్పోయి ఎయిర్ఫీల్డ్ పరిధిలోనే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
Related News
Comments
Login to leave a comment











