సింధు లోయ నాగరికతకు చెందిన సుమారు 4,300 ఏళ్ల నాటి పశుపతి ముద్రిక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక చిన్న ముద్రిక చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు భారతీయ నాగరికత, సాంస్కృతిక వారసత్వం, మత చరిత్ర, పురావస్తు పరిశోధనల వరకు విస్తరించింది. అసలు ఈ ముద్రికపై కనిపించే వ్యక్తి ఎవరు? ఆయన నిజంగా శివుడేనా? లేక మరో ప్రాచీన దేవతా రూపమా? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.