హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ శనివారం (మే 30) తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు వేదికైంది. సింగరేణి సంస్థకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కీలక నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం, ఆయన తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు.