
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సిఇవొ వాసిమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆయన వైదొలిగారు. ఐసిసి జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ఆ పదవిని వీడారు. జెఫ్ అల్లార్డస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఆయన పిసిబి సిఇవొగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీబ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.














