5586 articles


నవతెలంగాణ – హైదరాబాద్ :కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బాలికకు ఆల్కహాల్ తాగించి లైంగికదాడి చేయించడంతో పేట్బషీరాబాద్లో కేసు నమోదైనట్లు సమాచారం. 17 ఏండ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో లైంగికదాడికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరకు శుక్రవారం రాత్రి బాధితురాలి […] The post కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు! appeared first on Navatelangana.


హైదరాబాద్: తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బిఆర్ఎస్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలంటించారు. మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలని సూచించారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారని, కురచ బుద్ధితో బిఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మా




నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సీఐటీయూ ఒరిస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. కార్మిక హక్కుల కోసం దీర్ఘకాలంగా పోరాడిన ఆయన మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. బిష్ణు మొహంతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. The post ఒరిస్సా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి కన్నుమూత appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కోల్కతాలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం ఈ వేడుక జరిగింది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ (మమతా బెనర్జీ)పై బీజేపీ భారీ విజయం సాధించింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితీన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.

కోల్ కతా : బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సిఎం పదవికి సువేందు మొదటి వ్యక్తి కావడం గమనార్హం. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్డియే పాలిత రాష్ట్రాల సిఎంలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ ఆశీస్సులు సువేందు తీసుకున్నారు.




తన కెరీర్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ని అలరిస్తూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘రౌడీ జనార్ధన’. కాగా, శనివారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్తో విషెస్ తెలిపింది. ఇందులో విజయ్ కూర్చొని ఉండగా.. హీరోయిన్ అతడి గుండెపై కాలు మోపి ఉండటం మనం చూడొచ్చు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ ఈ పోస్టర్కి క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఇక రవికిరణ్ కొలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి ప్రాంతంలో 80వ దశకంలో సాగిన కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హైదరాబాద్: కేంద్రమంత్రి కుమారుడిని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీట్రాప్, ఎక్స్టార్షన్ (వసూళ్ల) ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. "కోర్టు" సినిమా కథను ఆదర్శంగా తీసుకొని లేని "పోక్సో" కేసు ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయట పడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని కేంద్రమంత్రి కుమారుడిని హనీట్రాప్లోకి దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగింది. ఈ వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావడంతో కేంద్ర మంత్రి కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించారని "పోక్సో" కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది. డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడ


మాజీ మంత్రి గంగుల కమలాకర్ అరెస్ట్బిజెపి, బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు.. దాదాపు వందమంది అదుపులోకికరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తత మరింత ముదిరింది. నగర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. గంగుల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన గంగుల కమలాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “బీజేపీ డౌన్ డౌన్”, “బండి సంజయ్ డౌన్ డౌన్” అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనవసరంగా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా మహిళా కార్యకర్తలను లేడీ పోలీసుల్లేకుండానే అదుపులోకి తీసుకున్నారంటూ బిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మహిళలను బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ


నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున 565వ జాతీయ రహదారిపై ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. The post ప్రయివేటు బస్సు బోల్తా..పలువురికి గాయాలు appeared first on Navatelangana.

సేవే పరమావధి, ఉచిత వైద్యంతో కోట్ల హృదయాలను సత్యసాయి ఆస్పత్రి గెలుచుకుంది. దేశంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే గుండె చికిత్సలు ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. పుట్టపర్తి నుంచి ప్రపంచానికి మానవతా సందేశం. నిన్నటి రోజున అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభంతో మరో మైలురాయిను ఈ ఆస్పత్రి చేరుకుంది. శ్రీ సత్యసాయి ఇనిస్ట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ పేరు చెప్పగానే పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం గుర్తుకు వస్తుంది. “డబ్బు లేక చికిత్స ఆగకూడదు” అనే దివ్య సంకల్పంతో శ్రీ సత్యసాయి బాబా ప్రారంభించిన ఈ వైద్యసేవా యజ్ఞం మూడు దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తోంది.అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి వైద్య సేవలు, పూర్తిగా ఉచిత చికిత్స ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలోని ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా మరో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం కావడం ద్వారా సేవల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. రూ.3.78 కోట్లతో ఆధునిక క్యాథ్ ల్యాబ్ ఆసుపత్రిలో రూ.3.78 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసి

