పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.