ఈ దేవాలయం "వీసా బాలాజి టెంపుల్" లేదా "వీసా గాడ్" గా ప్రసిద్ధి చెందినది.ఇది ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున అక్కన్న,మాదన్న నిర్మించిన పురాతన హిందూ దేవాలయం.ఈ టెంపుల్ లో హుండి ఉండదు.వివిఐపి దర్శనాలు ఉండవు.ఇది మెహదీపట్నంకి 17 కి.మీ. దూరంలో కలదు.ఈ గుడిని 13 వ శతాబ్ధంలో కట్టించినారు.








