తెలంగాణ · ఆంధ్రప్రదేశ్ · భారతదేశం · ప్రపంచ తెలుగు సమాచారం ఒకే చోట.
తెలంగాణ రాష్ట్ర వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు
భారతదేశం - జాతీయ స్థాయి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను సమావేశపరచేందుకు ఆమోదం తెలిపారు. ఈ సత్రంలో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

“MeitY has ordered Instagram to disable all ads and content promoting and facilitating access to CSEAM,” the sources said, adding that the Ministry also demanded a detailed explanation within seven days
The Department of Justice was providing a limited explanation to a U.S. district court on why it was dropping charges levied in 2024 of bribery and securities fraud against Gautam Adani, Sagar Adani, and their associates.
ప్రపంచవ్యాప్తంగా


న్యూఢిల్లీ: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం తరఫున ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికన్లకు తమ స్నేహబంధం ఆకాంక్షల సందేశం వెలువరించారు. భారత్ అమెరికాలు ప్రజాస్వామ్య నిబద్ధత గల దేశాలుగా ముందుకు సాగుతున్నాయి. చట్టపరమైన పాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఉమ్మడి విలువలు, సారూప్యత రెండు దేశాలను కలిపే సూత్రం అవుతోందని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి దిశలో భారత్ అమెరికా మధ్య స్నేహ బంధం ఓ అపరిమిత శక్తి అవుతుందని ఆకాంక్షించారు. ఇరుదేశాల బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామికమే కాకుండా అంతకు మించిన బంధం అని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన తాము పంపించే సందేశం ఇరుదేశాల స్నేహ బంధానికి ప్రతీక అని వెల్లడించారు. 1776 జులై 4వ తేదీన గ్రేట్ బ్రిటన్ పాలనను తెంచుకుని అమెరికాలోని 14 కాలనీలు లేదా ప్రాంతాలు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్రం సిద్ధించుకున్నాయి. అప్పటినుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉనికి సాగుతోంది.
