
దివంగత ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ మహానగరంలో 1999 వ సంవత్సరంలో ఎన్. చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించబడినది. ఈ గార్డెన్ మొత్తం 55 ఎకరాలలో విస్తరించినది. భౌగోళిక ప్రాంతం మరియు అద్భుతమైన సందర్శనా దృశ్యాలు కల ఎన్ టి అర్ గార్డెన్స్ చిన్నదే అయినా స్థానికులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హుస్సేన్ సాగర్ చెరువు పక్కనే ఉన్న ఈ ఎన్ టి అర్ గార్డెన్స్ ని తరచూ పర్యాటకులచే సందర్శించబడే గార్డెన్ గా చెప్పుకొనవచ్చు. కుటుంబ సమేతంగా పర్యాటకులు సాయం సమయాలని వినోదంగా గడపడానికి ఇక్కడి వస్తుంటారు.
టిక్కెట్ పెద్దవారికి 15 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు మరియు కెమరా తో వచ్చినట్లయితే 30 రూపాయలు వసూలు చేస్తారు.
సందర్శించు సమయం వారంలోని అన్ని రోజులలో పర్యటించవచ్చు. మధ్యానం 2:30 నుంచి రాత్రి 09:00 గంటల వరకు సందర్శించవచ్చు.
చూడటానికి పట్టే సమయం 2 గంటల నుంచి ౩ గంటల సమయం పడుతుంది.
రవాణా సదుపాయం దీనికి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ సెక్రటేరియట్, ఒకవేళ ఎం. ఎం. టి. ఎస్. లో వచ్చినట్లయితే నెక్లెస్ రోడ్ లో దిగాలి.








