మెదక్ కోట- నగరాన్ని ఆక్రమణదారుల నుండి రక్షించడానికి కాకతీయ పాలకులు నిర్మించిన ఒక పురాతన ప్రహరి కోట. ఈ కోట మెదక్ లో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతాపరుద్ర మహారాజు 12వ శతాబ్ద౦లో నిర్మించినదిగా భావించే దీనిని మెతుకు దుర్గం అని కూడా పిలుస్తారు.

కాకతీయ పాలకులకు, వారి తర్వాత చాలా కాలానికి రాజ్యం చేసిన కుతుబ్ షాహిలకు కూడా ఈ కోట నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు. ఈ కోట చారిత్రిక పరంగానే కాక పురావస్తు పరంగా కూడా గుర్తించదగినది. స్థానిక ప్రజల హృదయాలలో ఇది ఒక గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో బాటుగా పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.








