ఉత్తరప్రదేశ్‌ లోని హర్ధోయ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌ అభివృద్దికి ఈ హైవే ఎంతో దోహదం చేస్తుందన్నారు. 12 జిల్లాల మీదుగా సాగే హైవేను అత్యవసర సమయాల్లో యుద్ద విమానాలు ల్యాండయ్యే విధంగా నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రావడంతో పరిశ్రమలతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరం అన్నారు.