మనం ఇల్లు, కారు లేదా బ్యాంకు డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులకు వారసులను నియమించుకుంటాం. కానీ ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్న నేపథ్యంలో, మన మరణం తర్వాత డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ లీగల్ హైర్’ (డిజిటల్ వారసుడు) అనే సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తోంది.