Andhra Pradesh Investment: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడుల రంగం వేగంగా విస్తరిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీకి పరిశ్రమలు వరుసగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. గత 22 నెలల్లో రాష్ట్రానికి సుమారు 800 ప్రాజెక్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి రానుంది.