హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. టూ వీలర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్, ఓ వ్యక్తిని కారు బానెట్‌పై సుమారు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో జిలానీ కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.