ఎండలు ముదురుతున్నాయి.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం రకరకాల పానీయాలను ఆశ్రయిస్తాం. అయితే మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా వేసవిలో పెరుగు, మజ్జిగలకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర ఆధునిక పానీయాలకు లేదు. ఇవి రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ, వీటి స్వభావం, పనితీరు, శరీరానికి ఇచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..