ఐపీఎల్‌ 2026 పరుగుల వరదతో పోటెత్తుతోంది. గత రెండు రోజుల్లో మూడు సెంచరీలు నమోదైనా, విచిత్రంగా ఆ మూడు మ్యాచ్‌లలోనూ శతకాలు చేసిన జట్టు ఓటమి పాలైంది. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీ శతకాలు వృధా అయ్యాయి. భారీ స్కోర్లు చేసినా విజయాలు అందని ఈ వింత పోకడ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.