ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది.