Mohini Ekadashi 2026: వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. సముద్ర మథనంలో అమృతాన్ని కాపాడేందుకు శ్రీమహావిష్ణువు మోహినీ రూపం ధరించిన రోజు ఇదే అని పురాణ కథనం. ఈ రోజున ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల అధిక పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం ఏప్రిల్ 27న వచ్చిన ఈ ఏకాదశికి ధ్రువ యోగం కూడా ఉండటంతో విష్ణు భక్తి కార్యక్రమాలు మరింత శుభఫలితాలను ఇస్తాయని పండితుల అభిప్రాయం.