భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ, ఆన్‌లైన్ వేదికగా వేల కోట్ల రూపాయల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి తాజా నిదర్శనం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సాగుతున్న బెట్టింగ్ ఉధృతి. ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది 'పాలీమార్కెట్'.