35 ఏళ్ల క్రితం ఇంజిన్ లోపంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం అక్కడే వదిలేశారు. రన్‌వేకి అడ్డంకిగా మారడంతో, డీజీసీఏ హెచ్చరికల తర్వాత అధికారులు దానిని తొలగించారు. పార్కింగ్ ఛార్జీలు రూ.7 కోట్లకు చేరగా, ప్రస్తుతం విమానం శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు అమెరికా, యూరప్‌లలో సేవలందించి, ఇప్పుడు భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక బోయింగ్ 720 ఇది.