ఒక్క ఓటు ఒక దేశం స్వరూపాన్నే మార్చేస్తుంది. ఆ ఓటు వేసేందుకు కొందరు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ మరోసారి రిపీట్ అయింది. ఓ వ్యక్తి వేసిన ఒకే ఒక్క ఓటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందకంటే ఆ వ్యక్తి వేసిన ఒక్క ఓటు తేడాతో తన అభిమాన పార్టీ అభ్యర్థి విజయం సాధించింది. ఇదంతా ఒకెత్తైతే ఆ ఓటు వేయడం కోసం ఒక వ్యక్తి ఏకంగా ఒమన్ నుండి 3000 వేల కీలో మీటర్లు ప్రయాణించి రావడం మరొకెత్తుగా నిలుస్తోంది.