వేసవిలో ఎండ, దుమ్ము వల్ల చర్మం కాంతిహీనంగా మారుతుంది. అయితే, మనం పారేసే బొప్పాయి గింజలతో అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. బొప్పాయి గింజల పొడి, బియ్యప్పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. సున్నితమైన చర్మం ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి.