రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశాలు తమ విదేశీ బంగారు నిల్వల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో భారత రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం బంగారంలో 77 శాతం స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, వ్యూహాత్మక భద్రతా చర్య.