నేటి కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి, మానసిక అలసట అనేవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ముఖ్యంగా భారతీయ కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని సరైన సమయానికి ఇంటికి వెళ్లడం కూడా ఒక నేరంగా పరిగణించే పరిస్థితి నెలకొంది. దీనిపై గురుగ్రామ్‌కు చెందిన పారిశ్రామికవేత్త, '24NorthStar' సహ వ్యవస్థాపకురాలు నిష్ఠా త్రిపాఠి చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన పనిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఆఫీసు సమయం ముగియగానే వెళ్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులను ఆమె ఎత్తిచూపారు.