కృష్ణా నదిలో స్థానికులకు కనిపించిన పంచలోహ శ్రీరామ విగ్రహం సంచలనం సృష్టించింది. గుడిమెట్ల వద్ద బయటపడిన ఈ శిల్పం శతాబ్దాల నాటి ఆలయానికి చెందినదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు దీన్ని దైవ సంకేతంగా భావిస్తుండగా, అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖతో దాని చరిత్రను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు.