ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నాయి. దీంతో ఎండాకాలంలో ఇది చల్లని కబురుగా చెప్పవచ్చు.