Sri Veerabrahmendra Swamy Jayanti: మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆరాధనీయులు. ఆయన రాసిన “కాలజ్ఞానం” ద్వారా అనేక భవిష్యవాణులు ప్రసిద్ధి చెందాయి. దేశంలో జరిగే అనేక సంఘటనలను ఆయన ముందే చెప్పారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆయన జయంతి జరుపుకుంటారు. అదే రోజున ఆయన సజీవ సమాధిలో ప్రవేశించిన పవిత్ర దినంగా కూడా భావిస్తారు.