విలక్షణ నటుడు సూర్య , దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలయికలో మరో పవర్‌ఫుల్ సోషల్ డ్రామా సిద్ధమవుతోంది. 'జై భీమ్' వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరూ మళ్లీ చేతులు కలుపుతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. జ్ఞానవేల్ చెప్పిన సామాజిక అన్యాయాలపై గళమెత్తే బలమైన కథకు సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం 'కరుప్పు' (వీరభద్రుడు) షూటింగ్‌లో బిజీగా ఉన్న సూర్య, తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఈ క్రేజీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.