మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవపడుతున్నాడన్న కోపంతో భార్య, కుమారుడు కలిసి ఇంటి యజమానిని హత్య చేశారు. అనంతరం అది ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు చూపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.