భారతీయ సెలబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ 'విరుష్క' జోడీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఎండలు మండిపోతున్న వేళ, ఢిల్లీ వేడిని తట్టుకునేలా అత్యంత సాధారణమైన కానీ ఎంతో స్టైలిష్‌గా ఉండే దుస్తుల్లో ఈ జంట మెరిసిపోయింది.