వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి మనం ఎక్కువగా పుచ్చకాయలను తింటుంటాం. అయితే, ముంబైలో పుచ్చకాయ తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించిన ఘటన ఇప్పుడు అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఎండలో గంటల తరబడి నిల్వ ఉంచిన లేదా సరిగ్గా శుభ్రం చేయని పుచ్చకాయలు విషపూరితంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయను కోసినప్పుడు నురుగు రావడం, పుల్లటి వాసన రావడం వంటివి కనిపిస్తే అది మీ ప్రాణాలకే ముప్పు కావచ్చు. పుచ్చకాయను కొనేటప్పుడు, తినేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు పాడైపోయిన పండును గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.