ఆంధ్రప్రదేశ్‌ వాసులకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదుకానున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.