
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓటమి ఎరగకుండా ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధిస్తూ వచ్చిన పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకు రాజస్థాన్ బ్రేక్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి మళ్లీ తిరిగి పుంజుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచులు గెలిచిన గుజరాత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్తో నిశాంత్ సింధు ఆరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టులోకి బార్ట్లెట్, వైశ్యక్ వచ్చారు.















